అత్తాపూర్ లో ప్యూర్ కేర్ పాలి క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..

అత్తాపూర్ లో ప్యూర్ కేర్ పాలి క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..

ఆర్.బి.ఎం రాజేంద్రనగర్: ప్రజా సేవ చేయుటలో వైద్య రంగం ఎల్లప్పుడు తమ కర్తవ్యాన్ని నిరూపిస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అన్నారు అత్యాధునికతతో  కూడిన నూతన సాంకేతికత వైద్యానికి  నేటి సమాజానికి అవసరం అని అన్నారు అత్తాపూర్ డివిజన్ లో జన ప్రియా దగ్గర ప్యూర్ కేర్ పాలి క్లినిక్ ను ప్రారంభించారు. ప్రజలకు అన్ని రకాల వైద్యం అందించుటలో ప్యూర్ కేర్ క్లినిక్ ముందుండాలి అని అన్నారు. ఇలాంటి క్లినిక్ లు పేద వర్గాలకు సైతం అందించుటకు ఎనుకబడిన ప్రాంతాలలో విస్తరించాలని తెలిపారు. అన్ని సదుపాయాలతో ఏర్పటుచేసిన డాక్టర్ రోహిత్ ను ఎమ్మెల్యే అభినందించారు. మొదట ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పూజ కార్యక్రమంలో పాల్గొని క్లినిక్ ను ప్రారంభించారు. వారితో పాటు అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు వనం శ్రీరాం రెడ్డి రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు పోరెడ్డి ధర్మ రెడ్డి ప్రధాన కార్యదర్శి పలుగుచెరువు మహేష్ ,సీనియర్ నాయకులు కోలన్ సుభాష్ రెడ్డి మిద్దెల సురేందర్ రెడ్డి ,సురేష్ రెడ్డి చిన్న , విజయ్ , జైరాం రెడ్డి శరత్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published.