సీఎం జగన్ను టార్గెట్ చేసిన పవన్
ఆర్.బి.ఎం హైదరాబాద్: కొన్నిరోజులగా మౌనంగా ఉన్న జనసేన అధినేత పవన్కల్యాణ్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ ట్విటర్లో పవన్ పోస్ట్ పెట్టారు. ప్రజల మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం తాకట్టుతో అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదన్నారు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలకు ‘నవ కష్టాలు’ అని పవన్ పేర్కొన్నారు.
శనివారం హైదరాబాద్లో జరిగిన ‘రిపబ్లిక్’సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ పాల్గొన్నారు. ఏపీ సర్కారుపై, వైసీపీ తీరుపై విరుచుకుపడ్డారు. ఏపీ సర్కారు కొత్త అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలనుకుంటోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులు తీసే సినిమాపై ప్రభుత్వ ఆధిపత్యం ఏమిటని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ముకుమ్మడి దాడి చేశారు. పవన్ వ్యాఖ్యలు ఏపీలో చల్లారముందే మరోసారి ఆయన ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను పవన్ ఎత్తిచూపారు. శనివారం పవన్ చేసిన వ్యాఖ్యలపై మండపడ్డ మంత్రులు ఈ రోజు పవన్ చేసన ట్విట్పై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.