బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు: పద్మారావు గౌడ్ ఉపసభాపతి
ఆర్.బి.ఎం సికింద్రాబాద్: ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలిచేలా వైభవంగా జరగాలని అయన ఆకాంక్షించారు. సికింద్రాబాద్ పరిధిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిపామని పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లోని అడ్డగుట్ట, తార్నాక, మేట్టుగూడ, బౌధనగర్, సితాఫలమండీ డివిజన్ల పరిధిల్లో ఇప్పటికీ బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియను చేపట్టామని తెలిపారు. బతుకమ్మల నిమజ్జనానికి కుంట ల ఏర్పాటుకు, ఇతరత్రా ఏర్పాట్లకు రూ. 20 లక్షల నిధులను మంజూరు చేశామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. అన్ని కేంద్రాల్లో దీపాల ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.