రోశయ్య గారి మరణం అందరికీ తీరని లోటు: పద్మారావు గౌడ్, ఉప సభాపతి
ఆర్.బి.ఎం సికింద్రాబాద్: తమిళనాడు మాజీ గవర్నర్, సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.రోశయ్య గారి మృతి పట్ల తెలంగాణా శాసనసభ ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రాజకీయ రంగంలో తనదైన్ ముద్రను ఏర్పాటు చేసుకున్న రోశయ్య గారు తెలుగు ప్రజలకు చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయని ఈ సందర్భంగా నివాళులు అరిపించారు. దివంగత రోశయ్య గారి కుటుంబ సభ్యలకు తన సానుభూతి తెలుపుతూ, ఆయనతో తన అనుబంధాన్ని పద్మారావు గౌడ్ గుర్తు చేసుకున్నారు. రోశయ్య గారి మరణం అందరికీ తీరని లోటని సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.