సివరేజ్ పైప్ లైన్ నిర్మాణం పనులను ప్రారంభించిన పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం హైదరాబాద్, సీతాఫలమండీ:
సితాఫలమండీ డివిజన్ పరిధిలో Rs. 23.50 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సివరేజ్ పైప్ లైన్ నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు. చిలకలగూడ లోని ఎరుకల బస్తి, లైఫ్ స్ప్రింగ్ హాస్పటల్ ప్రాంతాల్లో పనులను ప్రారంభించిన సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో మంచి నీటి సమస్యలను పరిష్కరించ గలిగామని, సివరేజి సమస్యలను కుడా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ కుమారి సామల హేమ, జలమండలి జనరల్ మేనేజర్ రమణ రెడ్డి, ఈ ఈ శ్రీమతి ఆశా లతా, తెరాస యువ నేతలు కిశోరే కుమార్, రామేశ్వర్ గౌడ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.