నామమాత్రంగా గ్రామాల్లో లాక్ డౌన్..!
ఆర్.బి.ఎం డెస్క్: కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం విధితమే. కరోనాను కట్టడి చేసే క్రమంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం పది గంటల తర్వాత అనవసరంగా రహదారులపైకి వచ్చే వారికి పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తున్న నగర పోలీసులు.
కాగా గ్రామాల్లో మాత్రం లాక్ డౌన్ నామమాత్రంగా అమలవుతున్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో యువకులు లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా వాహనాలపై తిరుగుతున్నారు. మస్కులు,సామాజిక దూరం పాటించకుండా కరోనా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. వీరి చేష్టలకు గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సమయంలో రహదారులపైకి వచ్చే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.