క్యాసారం గ్రామంలో జై హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు..

క్యాసారం గ్రామంలో జై హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు..

ఆర్.బి.ఎం క్యాసారం: దేవీ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పఠాన్ చేరు నియోజకవర్గం క్యాసారం గ్రామంలో జై హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

జై హనుమాన్ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాల్లో గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారని వారు తెలిపారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని తెలిపారు. తమ గ్రామంలో గత 17 సంవత్సరాలుగా దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని సభ్యులు వెల్లడించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారికి నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు హోమాలు నిర్వహిస్తామని అన్నారు. కాగా ఈరోజు (బుధవారం) అమ్మవారి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, గ్రామంలోని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జై హనుమాన్ యువజన సంఘం సభ్యులు కోరారు.

Leave a Reply

Your email address will not be published.