బీజేపీలో చేరిన విశ్వేశ్వరరెడ్డి..
ఆర్.బి.ఎం హైదరాబాద్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, కొండా విశ్వేశ్వరరెడ్డి చేయి పట్టుకుని కార్యకర్తలకు అభివాదం చేయించారు. విశ్వేశ్వరెడ్డిపై గత కొంతకాలంగా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆయన కమలం పార్టీలో చేరారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరారు. గత ఏడాది మార్చిలో ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేశారు. విశ్వేశ్వరరెడ్డి సముదాయించేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన బీజేపీలో చేరి కాంగ్రెస్ నేతలు షాకిచ్చారు. టీఆర్ఎస్ తరపున 16వ లోక్సభకు విశ్వేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. 2013లో సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్లో చేరారు.