గులాబీ తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డి

గులాబీ తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్: కాంగ్రెస్ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డి ఎట్టకేలకు రాజకీయ వివాదాల మధ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.పాడి కౌశిక్ రెడ్డి ఆడియో సంభాషణ అందరికీ విధితమే.కాగా తాను ప్రకటించిన విధంగానే ఈ రోజు కెసిఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కౌశిక్ రెడ్డి కి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కౌశిక్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య అనుచరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరారు.హుజురాబాద్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థినీ నేనేనని ముందుగానే ప్రకటించుకున్న కౌశిక్ రెడ్డి.ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికలు జరుగనున్నాయి.కౌశిక్ రెడ్డి ముందుగా అన్న విధంగా హుజురాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికె కేటాయిస్తారా లేదా ఇంకా సీనియర్ నాయకులుకు ఇస్తారా అన్న అంశాలు తొందర్లోనే బహిర్గతం చేస్తారనే సమాచారం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *