దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణకు ప్రతీక దీపావళి: బి.జనార్దన్ రెడ్డి, చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి
జగతిని జాగృతిచేసే చైతన్యదీప్తిల శోభావళి. ప్రతి ఇంటా ఆనందదివ్వెలు వెలగాలి. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: దుష్ట శిక్షణ శిష్ఠ రక్షణకు ప్రతీకగా దీపావళి నిలిస్తుందని చేవెళ్ల పార్లిమెంట్ బీజేపీ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి అన్నారు.ఆశకు, జ్ఞానానికి, ఆనందానికి ,వికాసానికి, విజయాలకు ప్రతిరూపం దీపావళి అని పేర్కొన్నారు. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తిల శోభావాళి అని, ఎన్నో విజయోత్సవ చరిత్రలను కలిగిన దివ్య చరితావళి ఈ దీపావళి అని ఆయన తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలు, శాంతి సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు అందాలని,ప్రతి ఇంటా ఆనందపు కాంతులు వెదజల్లాలని , అజ్ఞానాంధకారాలు తొలగి విజ్ఞానపు వెలుగులు, ఆనంద దివ్వెలు వెలగాలని ఆయన ఆకాంక్షించారు.