హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల మధ్య జరుగుతున్న లొల్లికి ఇప్పట్లో బ్రేక్ పడేటట్లు కనిపించడం లేదు.

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల మధ్య జరుగుతున్న లొల్లికి ఇప్పట్లో బ్రేక్ పడేటట్లు కనిపించడం లేదు. రేవంత్ మౌనంగా ఉన్నా.. మల్లారెడ్డి మాత్రం రెచ్చిపోతున్నారు. రేవంత్‌రెడ్డి టార్గెట్ చేసుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మల్లారెడ్డి, రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి భంగపడ్డారు. అయినా ఆయన తన దోరణిలో మార్పు కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డిపై మల్లారెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక లఫూట్, డొకబాజీ, చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చినవాడని, ఇలాంటి వ్యక్తి సీఎం కేసీఆర్‌ను తిడుతారా.. అంటూ తీవ్రమైన పదజాలంతో రెచ్చిపోయారు. సీఎంను తిట్టిన రేవంత్ పురుగులు పడి చస్తారన్నారని శాపనార్దాలు పెట్టారు. గతంలో రేవంత్‌రెడ్డిపై మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఈ సారి ఆ పార్టీ మల్లారెడ్డిపై ఎలాంటి కార్యక్రమాలు చేస్తుందో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *