కన్న కూతురిపై తండ్రి ఆత్యాచారం.. తీవ్ర రక్తస్రావం కావడంతో..

కన్న కూతురిపై తండ్రి ఆత్యాచారం.. తీవ్ర రక్తస్రావం కావడంతో..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సమాజంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించిన కూడా వారికీ రక్షణ కరువైపోతుంది. రోజు ఎదో ఒక ప్రాంతంలో మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల వయసుతో సంబంధం లేడకుండా వారి పై కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. చెట్టుకు చీర కట్టిన కూడా వారు వదలిలే స్థితిలో లేరు. జంతువులను కూడా ఈ కామాంధులు వదలడం లేదు అంటే వారి పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు .

మానవాళి సైతం సిగ్గు పడే దారుణ ఘటన నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం గాంధీ నగర్‌ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు సంతానం. తల్లి కూలిపని నిమిత్తం రోజు లాగానే ఉదయం పనికి వెళ్ళింది. తమ కూతుళ్లు చిన్న వయసు కావడంతో వారిని ఇంట్లోనే వదలిలేసి పనికి వెళ్లిన తల్లి.

మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఓ కసాయి తండ్రి. మద్యం మత్తులో ఎలాంటి పైశాచిక పనులకు పాల్పడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఆ మూర్ఖపు తండ్రి చూపు తన కన్న కూతురిపై పడింది. అభంశుభం తెలియని ఆ పసికందుపై ఆ నీచుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన తండ్రి ఎం చేస్తున్నాడో కూడా తెలియని వయసు అది.

తన తల్లి కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి కూతురిని చూసి ఓ దశలో భయానికి గురైంది. ఆ పసికందు నడుస్తున్న క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ తల్లి కూతురిని అడగగా జరిగిన విషయం మొత్తం తల్లికి వివరించింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారి నివాసానికి చేరుకొని ఆ మూర్ఖపు తండ్రికి దేహా శుద్ధి చేశారు.

ఈ ఘటనపై తల్లి పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆ కిరాతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఘటనకు సంబంధించి ఆ గ్రామంలో ఆదివారం ఉదయం డీఎస్పీ ఉపేందర్ ‌రెడ్డి పర్యటించి వివరాలు సేకరించారు.

Leave a Reply

Your email address will not be published.