ఈటల రాజేందర్ తో ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్న.. మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

ఈటల రాజేందర్ తో ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్న.. మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురుకున్న అని జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత సంచలన వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో మమత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఎన్నో ఉన్నతమైన పదువులు అనుభవించారని ఆమె అన్నారు. ఈటలతో ఎన్నో రకాల ఇబ్బదులకు గురైయ్యానని మమత తన ఆవేదన వ్యక్తం చేసింది. తెరాస పార్టీ తో పేరు ప్రతిష్టలు సంపాదించి ఇప్పుడు పార్టీని నాయకులను విమర్శించడం సరైన చర్య కాదని ఆమె ఈటలను విమర్శించింది. అవసరం ఉన్నన్ని రోజులు కొమ్మపై కూర్చొని ఇప్పుడు నరకడం దేనికి సంకేతం అని ఆమె ప్రశ్నించారు. తెరాస పార్టీని వీడిన మరు క్షణం నుండి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తాము అని ఇతర పార్టీ నాయకులను కలవడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె ఈటలను ప్రశ్నించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి బాటలో నడవడానికి మేము సిద్ధంగా ఉంటాం అని ఆమె స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published.