కెసిఆర్ బొమ్మ మీద నేను గెలిస్తే మరి అదే బొమ్మ మీద కవిత ఎందుకు ఓడిపోయింది:ఈటల రాజేందర్

కెసిఆర్ బొమ్మ మీద నేను గెలిస్తే మరి అదే బొమ్మ మీద కవిత ఎందుకు ఓడిపోయింది:ఈటల రాజేందర్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకీ రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ పై టిఆర్ఎస్ పార్టీ నాయకులు తమ పదజాలంతో ఆయనపై దాడి చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మరికొందరు గులాబీ నాయకులు ఈటెల రాజేందర్ పై విమర్శల అస్త్రాలు ఉపయోగిస్తున్నారు.

ఈ క్రమంలో ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ నేను కేసీఆర్ బొమ్మతో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బి ఫాం తో గెలిచానని కొందరంటున్నారు. మరి నిజాంబాద్ లో కవిత కరీంనగర్లో వినోద్ కుమార్ ఎందుకు ఓడిపోయారు వారు కూడా అదే కేసీఆర్ బొమ్మ టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బి ఫామ్ తో నిలబడ్డారు మరి వారు ఎందుకు ఓడిపోయారని ఈటెల రాజేందర్ ఎదురు దాడికి దిగారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు కష్టాల్లో ఉన్నందున నేను రాజకీయాలు చేయదలచుకోలేదు నేను ప్రజలను వారి ప్రాణాలను గౌరవించే వ్యక్తి అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఉప ఎన్నికలు అనివార్యంగా తెస్తే ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *