మోండా మార్కెట్ లో ఘనంగా బోనాల వేడుకలు.. పలువురు మంత్రుల సందడి

మోండా మార్కెట్ లో ఘనంగా బోనాల వేడుకలు..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. మోండా మార్కెట్ తాకరా బస్తి న్యూ అశోక్ నగర్ లో తీగుళ్ల పద్మారావు గౌడ్ కుటుంబం నిర్మించిన ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు ఈ పూజల్లో పాల్గొని అనంతరం పద్మారావు గౌడ్ నివాసంలో విందుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సతీమణి శ్రీమతి కల్వకుంట్ల శోభ, పార్లమెంట్ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఏం ఎల్ ఏ శ్రీ ముఠా గోపాల్ లతో పాటు పలువురు నేతలు, అధికార అనధికార ప్రముఖులతో పాటు తీగుళ్ల పద్మారావు గౌడ్, అయన సతీమణి శ్రీమతి తీగుళ్ల స్వరూప గౌడ్, తెరాస యువ నేతలు తీగుళ్ల కిషోర్ కుమార్, కిరణ్ కుమార్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్ , వివిధ డివిజన్ల కార్పొరేటర్లు నాయకులూ, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కుమారి తీగుళ్ల మౌనిక గౌడ్ ఆధ్వర్యంలో తీగుళ్ల కుటుంబ సభ్యులు తెల్లవారుజామునే తమ నివాసం నుంచి ఉజ్జయిని మహంకాళి దేవాలయం వరకు వెళ్లి బోనం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published.