కెసిఆర్ పేదల పక్షపాతి.. సంక్షోభంలో కూడా సంక్షేమం : శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్

కెసిఆర్ పేదల పక్షపాతి.. సంక్షోభంలో కూడా సంక్షేమం :  తీగుల్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను యధాతధంగా చేపడుతున్న ఘనత తమ ప్రభుత్వనిదేనని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ముషీరాబాద్, మారేడుపల్లి రెవిన్యూ మండలాల పరిధిలో సితాఫలమండీ, బౌద్దనగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక డివిజన్లకు సంబంధించిన రూ. రెండు కోట్లకు పైగా విలువ చేసే 200 కళ్యాణ లక్ష్మి, శాదిముబారాక్, చెక్కులు, రూ. ఆరున్నర లక్షల విలువ చేసే 15 CMRF చెక్కులను సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాడు అర్హులకు పద్మారావు గౌడ్ అందచేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే దక్కిందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమానికి పలు సంక్షేమ పధకాలను అమలు జరుపుతోందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. షాది ముబరాక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్ పధకాల లబ్దిదారులు ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ కార్యాలయం నెంబరు 040-27504448 కు ఫిర్యాదు చేయవచ్చునని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. తహసీల్దార్ సునీల్ కుమార్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత , అధికారులు, నాయకులూ ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.