ప్రైవేట్ ఉద్యోగి ఖాతాలోకి రూ.కోటి 50 లక్షలు దళిత బంధు నిధులు

ప్రైవేట్ ఉద్యోగి ఖాతాలోకి రూ.కోటి 50 లక్షలు దళిత బంధు నిధులు

ఆర్.బి.ఎం హైదరాబాద్: ప్రైవేట్ ఉద్యోగి ఖాతాలోకి దళిత బంధు నిధులు వేశారు. రూ. లక్ష కాదు పది లక్షలు కాదు ఏకంగా ఆ ఉద్యోగి ఖాతాలో రూ.కోటి 50 లక్షలు జమ చేశారు. బ్యాంక్ క్లరికల్ తప్పిదంతో ఇతరుల అకౌంట్‌లో సొమ్ము ఉద్యోగి ఖాతాలో పడ్డట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 26న 15 మంది ఖాతాల్లోకి రూ.10 లక్షల చొప్పున రూ.15 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. లోటస్ ఆస్పత్రి సిబ్బంది ఖాతాల్లోకి దళితబంధు నిధులుపడ్డాయి. 15 రోజుల తర్వాత బ్యాంక్ అధికారులు తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు డబ్బులు రికవరీ చేశారు. ఓ వ్యక్తి మొత్తం డబ్బులు వాడుకోవడంతో సైఫాబాద్ పీఎస్‌లో బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *