ఆర్టీసీకీ పూర్వవైభవం తీసుకువస్తాం: సజ్జనార్
ఆర్.బి.ఎం వేములవాడ: ఆర్టీసీ సంస్థకు త్వరలో పూర్వవైభవం తీసుకువస్తామని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న ఆర్టీసీ సంస్థకు త్వరలోనే పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. త్వరలోనే వేములవాడతో పాటు అందుబాటులో ఉన్న ఆలయాలతో కలిపి టూరిస్టు ప్యాకేజ్ ప్లాన్ చేస్తామని తెలిపారు. త్వరలో వేములవాడ రాజన్న ప్రసాదాన్ని కార్గో ద్వారా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్గో సేవల ద్వారా ఇప్పటికే 100 కోట్ల ఆదాయం గడించిందన్నారు. త్వరలోనే కరీంనగర్, నల్లగొండ, వరంగల్, మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల నుంచి త్వరలో ప్రయోగాత్మకంగా ఎలక్ర్టిక్ వాహనాలను నడిపిస్తామని సజ్జనార్ అన్నారు.