వరంగల్‎లో మెడికల్ కాలేజ్ ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

వరంగల్: వరంగల్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం పర్యటించారు ములుగు క్రాస్ రోడ్ ( ఆరెపల్లి – దామెర క్రాస్ రోడ్డు )వద్ద ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట నెలకొల్పిన మెడికల్ కాలేజీని, హాస్పిటల్ ను సీఎం కేసీఆర్ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, వొడితెల సతీష్ కుమార్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.