హైదరాబాద్ మల్లాపూర్లో దారుణం..ఒక వ్యక్తిపై వేడి నూనె పోసిన బీజేపీ లీడర్ డ్రైవర్..

హైదరాబాద్ మల్లాపూర్లో దారుణం..ఒక వ్యక్తిపై వేడి నూనె పోసిన బీజేపీ లీడర్ డ్రైవర్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హైదరాబాద్ మల్లాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. శివ కుమార్ అనే వ్యక్తిపై వైన్ షాప్ పర్మిట్ రూంలో వేడి నూనె పోసిన బీజేపీ పార్టీకి చెందిన లీడర్ డ్రైవర్ ధర్మేందర్.తీవ్రంగా గాయపడిన శివ కుమార్ను వైన్స్ షాప్ యజమానులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివ కుమార్ పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్ గా ఉన్నటు సమాచారం.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని శివ కుమార్ పై నూనెతో దాడి చేసిన బీజేపీ లీడర్ డ్రైవర్ ధర్మేందర్ ను అదుపులోకి తీసుకున్నారు.ధర్మేందర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Reply

Your email address will not be published.