ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..

ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నతెలుగు వారందరికీ ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని   శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే ప్లవ నామ సంవత్సరంలో ప్ర‌తి ఇల్లూ సుఖ సంతోషాల‌తో క‌ళ‌క‌ళ‌లాడాలని ఈ ఏడాది కూడా సమృద్ధిగా వర్షాలు కుర‌వాలని యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న క‌రోనా పీడ శాశ్వ‌తంగా విర‌గ‌డ కావాల‌ని అయన కోరారు. కాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ  టిఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందని ఇప్పుడు ప్రజల చూపు బీజేపీ వైపే ఉందని అయన అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కేవలం ప్రగతి భవన్ కె పరిమితమైందన్నారు. తమ పార్టీ నాయకులపై వస్తున్న ఆరోపణలపై కెసిఆర్ మాట్లాడకపోవడం దేనికి సంకేతం అని జనార్దన్ రెడ్డి విమర్శించారు. కరోనా కట్టడిలోనూ తెరాస ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. తెలుగు పండగలకు ఆంక్షలు విధించే కెసిఆర్ తమ బహిరంగా సభలకు ఎందుకు ఆంక్షలు విధించుకోవడం లేదని ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని కెసిఆర్ పై జనార్దన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా ఏర్పడుతుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి బి.జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.