దళిత బంధు వాహనాలు ప్రారంభం, ఒకే రోజు ఏడుగురు లబ్దిదారుల కుటుంబాలకు ప్రయోజనం
ఆర్.బి.ఎం : దళిత బంధు పధకంలో భాగంగా అడ్డగుట్ట డివిజన్ కు చెందిన అయోధ్య, నర్సింగ్,మరియు సుజాత లకు స్విఫ్ట్ డిజైర్ వాహనాలను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అందచేశారు. సీతాఫల్మండి డివిజన్ కు చెందిన ఆనంద్ స్విఫ్ట్ వాహనాన్ని అందచేశారు. అదే విధంగా తార్నాక కు చెందిన కృష్ణవేణి,బలరాం,మరియు ప్రదీప్ కు మారుతి ఎర్టిగా వాహనాన్ని అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, యువనాయకులు తీగుళ్ల కిషోర్ కుమార్ గౌడ్,కిరణ్ కుమార్ గౌడ్,రామేశ్వర్ గౌడ్ తెరాస డివిజన్ నాయకులు , తదితరులు నాయకులు పాల్గొన్నారు.