తొమ్మిదో తరగతి విద్యార్థినికి కరోనా
డిండి: నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. విద్యార్థినికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా తెలిసింది. విద్యార్థినికి కరోనా కిట్ అందజేసి హోంక్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమెతోపాటు చదువుతున్న మరో 13 మంది బాలికలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని వైద్యులు తెలిపారు.