హీరో సాయిధరమ్ తేజ్ రోడ్ ప్రమాదానికి కారణం చెప్పిన చిరంజీవి

హీరో సాయిధరమ్ తేజ్ రోడ్ ప్రమాదానికి కారణం చెప్పిన చిరంజీవి

ఆర్.బి.ఎం హైదరాబాద్: హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో ఇంటికి తిరివస్తారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సాయి త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు సాయిధరమ్ తేజ ఆరోగ్యంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఓ సందేశాన్ని పంపారు. సాయిధరమ్ తేజకు ప్రమాదంలో స్వల్పగాయాలయ్యాయని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులెవరూ కంగారు పడొద్దని చిరంజీవి తెలిపారు. ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి మద్యం తాగలేదన్నారు. రోడ్డుపై ఇసుక ( మట్టి ) ఉండడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారని ట్విట్టర్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *