టాలీవుడ్‎లో మరో విషాదం..

టాలీవుడ్ లో మరో విషాదం..సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం కలిగింది. ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, శ్రీమతి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరాదేవి నివాసంలోనే బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కృష్ణా ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. రమేష్‌బాబు, మహేష్‌బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఇందిరాదేవి మృతితో ఘటమనేని కుటుంబంతో పాటు..టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలోనే…విజయ్ నిర్మల, రమేష్ బాబు మృతితో దిగాలు చెందుతున్న ఘట్టమనేని కుటుంబంలో ఇప్పుడు ఇందిరాదేవి దూరం అవ్వడంతో మరింత బాధాకరమైన విషయం ఇది.

Leave a Reply

Your email address will not be published.