వాళ్ళు నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు: నటి కీర్తి సురేష్

వాళ్ళు నాకు నాలుగు సార్లు పెళ్లి చేశారు: నటి కీర్తి సురేష్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: అగ్రకథానాయికల్లో ఒక్కరు కీర్తిసురేశ్ హీరో రామ్ సరసన నటించిన నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తనకంటూ గుర్తింపు తెచ్చుకుని యువతను ఆకర్షించారు. ఎంతో క్యూట్ గా అమాయకంగా కనిపించే కీర్తి సురేష్ కు అందరూ ఫిదా అయిపోయారు.

‘మహానటి’ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ సినిమాతో కీర్తి సురేష్ జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. వరుసగా ఆమె వద్దకు ఆఫర్లు క్యూ కట్టడం మొదలయ్యాయి.

కీర్తి సురేష్ తనపై సామజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లపైనా స్పందించింది. సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి అయిపోయింది అన్న వార్తలు చాల వస్తున్నాయి అని ఆమె అన్నారు. ముందు ఆ రూమర్స్ చూసినప్పుడు బయమేసింది అని ఆమె అన్నారు. తర్వాత అలంటి రూమర్స్ కి భయపడటం మానేసానని నవ్వడం మొదలుపెట్టానని కీర్తి సురేష్ అన్నారు.

అలంటి రూమర్స్ తో ఇప్పటికే తనకి సామజిక మాధ్యమాల్లో మూడు నాలుగు సార్లు పెళ్లి అయిపోయినట్టు వార్తలు ఫోటోలు వచ్చాయని అవి చుసిన తర్వాత షాక్ అయ్యాను అని ఆమె అన్నారు.

కీర్తి సురేష్ పెళ్లి ప్రస్తావన మాట్లాడుతూ నేను పెళ్లి చేసుకుంటే తప్పకుండ అందరికి తెలియచేస్తానని ఆమె అన్నారు. కాగా ఇప్పట్లో పెళ్లి పై ఎలాంటి నిర్ణయం తీసుకోనని కీర్తి వెల్లడించారు. పెళ్ళికి ఇంకా సమయం చాల ఉందని ఆమె తెలిపారు. ఇప్పుడు తాను సినిమాల్లో చాల బిజీగా ఉన్న అని కీర్తి సురేష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు .

Leave a Reply

Your email address will not be published.