హైదరాబాద్ : ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన మూవీ..కార్తికేయ-2. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ చిత్రాలలో కార్తికేయ-2 నిలిచిపోయింది. ఒక్కసారిగా ఈ సినిమాతో హీరో నిఖిల్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.120కోట్ల వరకు కలెక్షన్లు సాధించి కంటెంట్ ఉన్న సినిమాలకు తిరుగులేదని సత్తా చూపించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందానని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. కార్తికేయ-2 చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 భారీ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ జీ సంస్థ ప్రకటించింది.