తెలంగాణాలో పదవ తరగతి పరీక్షలు రద్దు?
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కేంద్రం ఇప్పటికే సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు చేసింది కాగా పన్నెడవ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ప్రకటించింది. అయితే తాజాగా తెలంగాణాలో రాష్ట్రంలో టెన్త్ బోర్డు ఇంటర్ బోర్డు అధికారులతో భేటీ అయినా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి. తెలంగాణాలో కరోనా విజృంభణ నేపథ్యంలో రోజు రోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న క్రమంలో పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు చేసి పన్నెడవ తరగతి పరీక్షలు వాయిదా వేసినట్టు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ తరహాలోనే నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. మరికొద్ది క్షణాల్లో అధికారులతో భేటీ అనంతరం పరీక్షల రద్దు స్పష్టత ఇవ్వనున్న విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి.