టీ20 ప్రపంచకప్ 2022: ఐర్లాండ్ ఇంటికి..సెమీస్‎కి దూసుకెళ్లిన న్యూజిలాండ్

2022 టీ20 వరల్డ్ కప్‎లో న్యూజిలాండ్ జట్టు సెమీస్‎కి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ఐర్లాండ్ టీమ్‎పై 35 పరుగుల తేడాతో గెలిచి తొలి జట్టుగా సెమీస్ లో అడుగు పెట్టింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ లో ఓపెనింగ్ బ్యాటర్లు ఫిన్ అలెన్ (32), డెవాన్ కాన్వే (28) జట్టుకి శుభారంబాన్ని ఇచ్చారు. కేన్ విలియమ్సన్ కేప్టెన్ ఇన్నింగ్స్ (35 బాల్స్ లో 61 పరుగులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)కి తోడుగా డారిల్ మిచెల్(31) తోడవడంతో న్యూజిలాండ్ 185 పరుగులు చేసింది.

కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు..ధాటిగా ఆరంభించారు. పాల్ స్టిర్లింగ్ (27 బాల్స్ లో 37 పరుగులు) కేప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (25 బాల్స్ లో 30 పరుగులు) చక్కని ఇన్నింగ్స్ ఆడారు. తర్వాత వచ్చిన ఆటగాళ్లు రాణించకపోవడంతో ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ బౌలర్లు లాకీ ఫెర్గూసన్ 3, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ చెరో 2 వికెట్లు తీసుకొని ఐర్లాండ్ ని 150 పరుగులకి కట్టడి చేశారు. 5 మ్యాచ్ ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచిన ఐర్లాండ్ ఇంటి దారి పట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *