రూ. నాలుగు కోట్ల కరెన్సీతో.. ధనలక్ష్మీదేవి అలంకరణ
నిడమర్రు: ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులోని ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో దసరా వేడుకల్లో భాగంగా ఉమా దేవి అమ్మవారిని శనివారం రూ.నాలుగు కోట్ల కరెన్సీతో ధనలక్ష్మీ దేవిగా అలంకరిం చారు. ఆలయ నిర్వాహకుడు సరిపల్లె శంకరం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మొదలైన అలంకరణ పనులు తెల్లవారు జాము వరకు జరిగాయి. ఈ మేరకు ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక లోని బ్యాంకుల నుంచి ప్రత్యేకంగా నూతన కరెన్సీని తెప్పించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.