హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాలేజీలకు ఈ నెల 2వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి అక్టోబర్ 10వ తేదీన ఇంటర్ కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.