హైదరాబాద్: నగర ప్రజలు పల్లెబాట పట్టారు. పిల్లలకు దసరా, బతుకమ్మ సెలవులు రావడంతో సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఊర్లో పండగ జరుపుకునేందుకు సొంతూరు బాటపట్టారు. ఇక..ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రద్దీ భారీగా పెరిగింది. పండుగల సందర్భంగా రైల్వేశాఖ మూడు, నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఇక ఆర్టసీ విషయానికి వస్తే.. 4వేల పైన ఆన్ లైన్ రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపింది. అదనపు 517 సర్వీసులు ఏర్పాటు చేసింది. వీకెండ్, పండుగ కావడంతో రేపటి నుంచి మరింత రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.