తిరువనంతపురం : దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం (సెప్టెంబరు 28) నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకు తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం సోమవారం మధ్యాహ్నం భారత ఆటగాళ్లు హైదరాబాద్ నుంచి నేరుగా కేరళ వెళ్లారు. తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. టీమిండియా బస చేసే హోటల్ వద్ద టీమిండియా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు కేరళ క్రికెట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్సు దిగి హోటల్కు వెళ్లే దారిలో ఆటగాళ్లపై అందమైన అమ్మాయిలతో పూలు చల్లించింది. రెండు వైపులా అమ్మాయిలు నిలబడి ఆటగాళ్లపై పూలు చల్లారు. దాంతో కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నవ్వులు పూయిస్తూ హోటల్ లోపలి వెళ్లారు. పూలు మాత్రమే కాదు ప్లేయర్ల మెడలో మెడల్స్ కూడా అమ్మాయిలతోనే వేయించింది కేరళ క్రికెట్ బోర్డు.