సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ..మహేష్, త్రివిక్రమ్ మూవీ టైటిల్‎..

మాటల మాంత్రికకుడు..స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం ఇటీవల షూటింగ్ మొదలైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్. రాధాకృష్ణ చినబాబు నిర్మాత. అయితే..షూటింగ్ ప్రారంభం అయ్యంది కానీ..సినిమా టైటిల్ ఖరారు చేయలేదు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక హాట్ టైటిల్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

త్రివిక్రమ్, మహేష్ బాబు సెంటిమెంట్ కలగలిసేలా ఉన్న ఈ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపుఊపేస్తోంది. ఇంతకీ ఆ పవర్ ఫుల్ టైటిల్ ఏమిటని తెలుసా? ‘అయోధ్యలో అర్జునుడు’.ఇందులో త్రివిక్రమ్ సెంటిమెంట్ అయినటువంటి మొదటి అక్షరం ‘అ’, మహేష్ బాబు సెంటిమెంట్ అయినటువంటి చివరి అక్షరం ‘డు’.(రాజకుమారుడు, అతడు, ఒక్కడు, దూకుడు, సైనికుడు, ఆగడు, శ్రీమంతుడు) ఉండటంతో.. మ్యాగ్జిమమ్ ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది. చూడాలి ఏ టైటిల్ ఖరారు అవుతోందో తెలియాలంటే..మరికొద్దీ రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.