తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్ షా
ఆర్.బి.ఎం హైదరాబాద్: తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని తెలిపారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందిస్తామని హెచ్చరించారు. తెలంగాణ పోరాటానికి మొదటి నుంచి బీజేపీ మద్దతు ఇస్తోందని గుర్తుచేశారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ అసంపూర్తిగా చేసిందని అమిత్షా తప్పుబట్టారు. గతంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు సమస్య రాలేదని తెలిపారు. కేసీఆర్ మూఢనమ్మకాలతో సచివాలయాన్ని కూల్చారని మండిపడ్డారు. సచివాలయానికి కేసీఆర్ రాక ఎన్ని రోజులైంది? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చెప్పారు. ఎంఐఎం కోసమే కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడంలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విధానాలతో అభివృద్ధిలో తెలంగాణ వెనుకబడుతోందని అమిత్షా విమర్శించారు