కేటీఆర్ ఫాంహౌస్‌ వివాదంపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ

కేటీఆర్ ఫాంహౌస్‌ వివాదంపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ

ఆర్.బి.ఎంహైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఫాంహౌస్‌ వివాదంపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఎన్జీటీ జారీ చేసిన నోటీసులను హైకోర్టులో కేటీఆర్ సవాల్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసు వేశారన్న కేటీఆర్ తరపు లాయర్ వాదించారు. జన్వాడ ఫాంహౌస్‌కు.. కేటీఆర్‌కు సంబంధం లేకపోయినా ఎన్జీటీ కేసులో కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్రతివాదిగా చేర్చారని తెలిపారు. కేటీఆర్‌కు సంబంధం లేకపోతే ఎన్జీటీ ముందు వాదనలు వినిపించవచ్చని, లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని, హైకోర్టుకు రావడం చట్టవిరుద్ధమని రేవంత్‌ తరపు లాయర్ వాదించారు. ఇరువాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *