భానూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

భానూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

ఆర్.బి.ఎం పటాన్ చేరు, భానూర్: పటాన్ చేరు నియోజకవర్గం పరిధిలోని భానూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పటాన్ చేరు నియోజకవరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి ఈరోజు ప్రారంభించారు(శుక్రవారం). ఈ సందర్బంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులకు పంటను విక్రయించకూడదని ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని దళారులను నమ్మి మోసపోకూడదని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

గ్రేడ్ వన్ రకానికి 1860 రూపాయలు.. గ్రేడ్ టు రకానికి 1840 రూపాయల మద్దతు ధరను రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిందని మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశం లోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శనంగా నిలుస్తున్నాయని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వ్యవసాయ శాఖ అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.