గెలిచిన నాడు ఎగరం.. ఓడిన నాడు ఇగరం: ధర్మ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ తెరాస ప్రెసిడెంట్
ఆర్.బి.ఎం రాజేంద్రనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుపై రాజేంద్రనగర్ నియోజకవర్గం టీఆరెస్ ప్రెసిడెంట్ ధర్మ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా ధర్మ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ తాము గెలిచిన నాడు ఎగరమని ఓడిన నాడు ఇరగం అని ఓడిన, గెలిచిన ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తామని ఆయన అన్నారు. ఒక్కసారి పడితే వందసార్లు లేస్తం నిక్కర్సైన గులబొల్లామ్ అని ధర్మ రెడ్డి పేర్కొన్నారు.
సామాన్య ప్రజల పాలిట కేంద్ర ప్రభుత్వం శాపంగా మారిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను బ్రతకాకుండా చేస్తుందని ధర్మ రెడ్డి మండిపడ్డారు.
మరోసారి బీజేపీ,కాంగ్రెస్ అనైతిక పొత్తు బయటపడిందన్నారు. తెలంగాణ అభివృద్ది కోసం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెరాస పార్టీని ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు ఒక్కటైయయని ధర్మ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.