నవాబుపేట్ లో బీజేపీ నేతల సంబరాలు..

నవాబుపేట్ లో బీజేపీ నేతల సంబరాలు..

ఆర్.బి.ఎం నవాబుపేట్: హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ 23 వేలకు పైగా భారీ మెజారిటీతో అధికార టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై గెలుపొందడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం రేకెత్తింది. నవాబుపేట్ మండల కేంద్రంలో బీజేపీ యువ నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. బిజెపి నినాదాలతో హోరెత్తించి, బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా వికారాబాద్ బీజేపీ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగిన పోరులో బిజెపి జెండా రెపరెపలాడిందన్నారు.హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర నూతన భవిష్యత్తుకు నాంది పలికిందన్నారు.రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.