సింగరేణి కాలనీ చిన్నారి హత్య కేసు.. రంగంలోకి సజ్జన్నార్
ఆర్.బి.ఎం: సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికను హత్యాచారం చేసిన నిందితుడిని పట్టుకునేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ రంగంలోకి దిగారు. ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ బస్టాండ్లలో ముమ్మర తనిఖీలు చేయాలని ఆదేశించారు. చిన్నారి హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. హైదరాబాద్లో అన్ని పోలీస్స్టేషన్లను సీపీ అంజనీకుమార్ ఆదేశాలిచ్చారు. రోడ్లపై నిందితుడు రాజు ఫోటోలు చూపించి, ప్రజలకు పోలీసులు తెలియజేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్లు, రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లలో రాజు కోసం పోలీసుల ముమ్మరంగా తిరుగుతున్నారు. ఇప్పటివకే నిందితుడు రాజుపై హైదరాబాద్ పోలీసులు 10 లక్షల రివార్డు ప్రకటించారు. నగర వ్యాప్తంగా పోలీసుల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.