రాజాసింగ్ కు మగతనం,దైర్యం ఉంటె.. రాజాసింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి

రాజాసింగ్ కు మగతనం,దైర్యం ఉంటె.. రాజాసింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. దారుస్సలాం ఎమ్మెల్యే రాజాసింగ్ రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.రాజాసింగ్ కు బీజేపీ పార్టీ లోనే విలువ లేదు అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నాయకులే ఆయనను పట్టించుకోకుండా వదిలేశారు. రాజాసింగ్ ను బిజెపి నాయకులు పక్కన పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి రాజా సింగ్ కు లేదన్నారు. కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే నల్ల డబ్బులు మొత్తం ప్రజలకు పంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.బిజెపి అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా ఏ పేద వాడి అకౌంట్ లో కూడా 15 లక్షల రూపాయలు వేయలేదని రాజాసింగ్ ఏదైనా అడగాలనుకుంటే ప్రధానమంత్రి మోడీ ని అడగాలని జగ్గారెడ్డి సూచించారు. ప్రధానమంత్రి మోదీ ముందు నీ మగతనం, ధైర్యం చూపించు అంటూ రాజాసింగ్ పై జగ్గారెడ్డి మండిపడ్డారు. భారతదేశంలో ఉన్న పేద వాళ్లందరికీ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేయకపోయినా కనీసం దారుస్సలాం నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజల అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేసి అప్పుడు రాహుల్ గాంధీని ప్రశ్నించాలి అంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశంలో అన్నారు .

బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి.. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *