రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డ బండి సంజయ్

రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డ బండి సంజయ్

ఆర్.బి.ఎం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే తెరాస ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని బండి సంజయ్ విమర్శించారు. దళిత అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధుతో పాటు బీసీ బంధు, గిరిజన బంధు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని బండి సంజయ్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల కోసం బీజేపీ పార్టీ నిర్వహించబోయే దరఖాస్తుల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈరోజు కరీంనగర్ లో ఓ కార్యక్రమానికి హాజరై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *