రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం: డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం: వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి వికారాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్ల కండువాలతో, బైక్ ర్యాలీ తీసి NTR చౌరస్తాలో నరేంద్రమోడీ దిష్టి బొమ్మ దహనం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి వ్యతిరేక నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సాక్షిగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి, ఉద్యమ పోరాటాలు చేసి రాజ్యాంగ బద్దంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర విభజన పై అదే పార్లమెంట్ లో తప్పుగా మాట్లాడటం సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజానికానికి బేషరుతుగా క్షమాపణలు చెప్పాలన్నారు.

ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేయూతను అందించాల్సింది పోయి, బడ్జెట్ లో కోతలు విధిస్తూ అన్యాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించని కేంద్ర ప్రభుత్వం ఇలా మాట్లాడటం హేమనియమైన చర్య అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర వాటా ఇవ్వడం చేతకాని మోడీ అడ్డగోలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published.