రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది : డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది : డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రాంపూర్ రైతువేదికలో కోట్ పల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి /షాదిముబారక్ చెక్కులను పంపిణి చేశారు. పేదింటి ఆడ పిల్లల పాలిట కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ఓ ‌వరమని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రం అందిస్తుందన్నారు. కల్యాణలక్ష్మి /షాదిముబారక్ పథకాలతో బాల్య వివాహాలు అరికట్టి ఆడబిడ్డల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.