అధికార టీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఒకేసారి 9 మంది రాజీనామా..

అధికార టీఆర్‌ఎస్‌కు షాక్‌

ఆర్.బి.ఏ.  హత్నూర్: గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆరోపిస్తూ హత్నూర మండలం కాసాల గ్రామపంచాయతీ వార్డుసభ్యులు 9 మంది తమ పదవికి రాజీనామా చేసి గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్‌రెడ్డికి రాజీనామా పత్రాలను అందించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలో 12 మంది వార్డుసభ్యులు ఉండగా.. తొమ్మిదిమంది వార్డుసభ్యులు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని ఆరోపిస్తూ మూకుమ్మడిగా రాజీనామా చేసి కార్యదర్శికి పత్రాలను అందజేశారు. తొమ్మిదిమంది వార్డుసభ్యులు రాజీనామా విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు కార్యదర్శి నవీన్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.