సంగారెడ్డిలో సొంత మనవడిని అతి కిరాతకంగా చంపి…
ఆర్.బి.ఎం డెస్క్ : మానవత్వం మంటగాల్సింది అనే దానికి ఉదాహరణ సంగారెడ్డి లో చోటుచేసుకున్న దారుణ ఘటన. తన కూతురి కొడుకుని వేరే వ్యక్తితో కలిసి అతి కిరాతంగా హత్యచేసింది. బాలుడు ఇంట్లో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికులు ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. కాగా గురువారం రోజు సంగారెడ్డి లోని బొబ్బిలకుంట చెరువులో బాలుడి శవం లభ్యమైంది. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయాలు బయటికి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు కూతురి భర్త రెండేళ్ల క్రితం చనిపోవడంతో ఆమె వాళ్ళ పుట్టింటికి వచ్చేసింది. నిందితురాలు తన కూతురికి మళ్ళి వివాహం చేయాలనీ నిర్ణయించుకుంది.ఈ నేపథ్యంలో తన కూతురి వివాహానికి ఆ చిన్నారి యశ్వంత్ అడ్డువస్తున్నాడనే కారణంతో కఠిన నిర్ణయం తీసుకుంది. పథకం ప్రకారం తన మనవడిని వేరే వ్యక్తి సహాయంతో అతి కిరాతకంగా చంపి ఆ మృతదేహాన్ని బొబ్బిలకుంట చెరువులో పడేసినట్లు నింధితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.