ఇంటర్ ప్రాక్టికల్స్‌ వాయిదా..

ఇంటర్ ప్రాక్టికల్స్‌ వాయిదా..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికె విద్యాశాఖ మంత్రి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసేశారు.కాగా తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్‌ ను వాయిదా వేశారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు శనివారం నిర్ణయాన్ని వెల్లడించింది.ఈ నెల ఏప్రిల్ 7వ తేదీ నుండి జరగాల్సిన ప్రాక్టికల్స్‌ పరీక్షలను పోస్టుపోన్ చేస్తునట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది.పోస్టుపోన్ చేసిన ప్రాక్టికల్స్‌ మే 29 నుంచి జూన్‌ 7 వరకు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు వెలువరించింది. కరోనా నేపథ్యంలో ఎగ్జామ్స్ నిర్వాహణపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో తీవ్రమైన భయం నెలకొంది. ముందుగా ప్రకటించిన విధంగా మే 1నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామంటూ ఇంటర్ బోర్డు కొద్ది రోజుల క్రితం వెల్లడించిన సంగతి అందరికి తెలిసిందే. గతంలో లాగా పరీక్షలు నిర్వహించకుండా ఈ ఏడాది విద్యార్థులందరినీ పాస్ చేసే దిశగా బోర్డు లేదని స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు. పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.