డీజీపీని కలిసిన రేవంత్‌రెడ్డి..

డీజీపీని కలిసిన రేవంత్‌రెడ్డి..

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ అనుమతి కోసం డీజీపీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్సీ నేత భట్టి విక్రమార్క కలిశారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అన్ని శక్తులను ఏకం చేసే యాత్ర ఇదని తెలిపారు. దేశాన్ని కాపాడుకోవడానికి యువత ముందుకు వచ్చి జోడో యాత్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ యాత్రకు భద్రత కల్పించాలని డీజీపీని కోరామని ఆయన తెలిపారు.

రాహుల్ గాంధీ జోడోయాత్రకు భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. జోడో యాత్ర ఈనెల 24న తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాపును కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. రాహుల్ గాంధీ 15 రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. దాదాపుగా రాష్ట్రంలో 350 కిలోమీటర్లు యాత్ర కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *