రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్..

రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్..

హైదరాబాద్: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో ఆదివారం ‘మన ఊరు- మన పోరు’ సభను కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. రేవంత్‌రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని హెచ్చరించారు. రేవంత్‌ వల్ల మహబూబ్‌నగర్‌కు పైసా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. డబ్బు కోసమే రేవంత్‌రెడ్డి టీపీసీసీ కొనుక్కున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. రేవంత్‌రెడ్డి బ్రోకర్‌లా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే రేవంత్‌కు పడదని విమర్శించారు. ఆయనకు దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మళ్లీ మల్కాజ్‌గిరిలో రేవంత్‌రెడ్డి గెలిచే దమ్ము ఉందా అని బలరాజు నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *