ప్రమాదాలకు నిలయంగా నవాబుపేట్, వికారాబాద్ ప్రధాన రహదారి: శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి

ప్రమాదాలకు నిలయంగా నవాబుపేట్, వికారాబాద్ ప్రధాన రహదారి: శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి

ఆర్.బి.ఎం నవాబుపేట్: నవాబుపేట్ నుండి వికారాబాద్ వెళ్లే ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

శ్రీకాంత్ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఆరెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నవాబుపేట్ రోడ్లను చూస్తే అర్థమౌతుందని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు పూర్తిగా గుంతలుగా ఉన్నడంతో ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో గత ఆరు నెలల క్రితం బీజేపీ ఆధ్వర్యంలో మైసమ్మ గడ్డ నుండి నవాబుపేట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామని ప్రకటించగానే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేక వస్తుందనే భావనతో అధికార పార్టీ ఎమ్మెల్యే కాలే యాదయ్య తదుపరి రోజు నవాబిపేట్ రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం ఐదు కోట్లు మంజూరు చేసిందంటూ ప్రకటన చేశారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

రెండు నెలల క్రితం ఎదో అడవిడిగ గుంతలు పూడ్చి చేతులు దులుపుకున్నారని, ఎడ తెరపి లేని వర్షాలకు కొత్తగా వేసిన కంకర మరియు దుమ్ముతో ద్విచక్ర వాహనదారులు మరింత ఇబ్బంది పడుతున్నారు అని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే కండ్లు తెరవాలని ప్రజల బాధలు తెలుసుకోవాలని,రోడ్లను వెంటనే బాగు చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published.